మహాత్మాగాంధీకి నోబెల్ బహుమతి ఎందుకివ్వలేదు !

-

దాదాపుగా రెండు వందల సంవత్సరాలకు పైగానే ఇండియాను పాలించిన ఆంగ్లేయులు ఆ తర్వాత ఎందరో మహానుభావులు ఉద్యమాలు, దీక్షలు చేసి తమ ప్రాణాలను సైతం అర్పించి స్వాతంత్య్రం మనకు తెచ్చి పెట్టారు. అయితే వీరిలో మోహన్ దాస్ కరమ్ చాంద్ గాంధీ ని మాత్రమే చాలా మంది స్వాతంత్య్రం రావడానికి ప్రథముడు అని గుర్తు పెట్టుకుని ఉన్నారు. ఈయనను మన దేశ ప్రజలు జాతిపిత, మహాత్ముడు అన్న బిరుదులతో పిలుచుకుంటూ ఉంటారు. ఈ రోజు అక్టోబర్ 2న అయన జన్మదినం కావడం వలన మరోసారి ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. కానీ దేశానికి ఎంతో చేసిన మహాత్మాగాంధీకి మాత్రం నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా శాంతి అనే ఆయుధంతో మన దేశంవైపు చూసేలా చేశాడు గాంధీ. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి నోబెల్ బహుమతులను అందుకున్న వారే మహాత్మాగాంధీ మాకు స్ఫూర్తి ని చెప్పారు.

అయితే గాంధీకి నోబెల్ పురస్కారం మాత్రం దక్కలేదు. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం అయిదు సార్లు ఈ బహుమతి కోసం నామినేట్ అయ్యారట గాంధీ. కానీ కేవలం భారతీయుల కోసం పోరాడిన ఒకే ఒక్క కారణంగా ఆంగ్లేయులు ఈయనను నోబెల్ బహుమతిని ఇవ్వలేదని ఇప్పటికీ ప్రముఖులు చెప్పుకుంటూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news