జూనియర్ ఎన్టీఆర్ కు టి.డి.పి పగ్గాలు..!

-

ఏపి ఎలక్షన్స్ హడావిడి మొదలు కాబోతున్న ఈ తరుణంలో భవిష్యత్తులో టిడిపి పగ్గాలు జూనియర్ ఎన్.టి.ఆర్ చేతుల్లోకి రానున్నాయన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఎవరో అంటున్న మాట కాదు ఏకంగా టిడిపి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు అంటున్నమాట. తెలంగాణా రాష్ట్రంలో అశ్వారావు పేట నియోజకవర్గం టిడిపి నుండి గెలుపొందిన మచ్చా నాగేశ్వర రావు రెండు మూడేళ్లలో తెలంగాణా టిడిపి పగ్గాలు జూనియర్ ఎన్.టి.ఆర్ చేతుల్లోకి వస్తాయని చెప్పారు.

మళ్లీ అప్పుడు తెలంగాణాలో కూడా టిడిపికి పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయగా టి.ఆర్.ఎస్ కే అందరు ఓటు వేశారు. టిడిపి పోటీ చేసిన 12 స్థానాల్లో కేవలం 2 స్థానాల్లో అది కూడా సత్తుపల్లి, అశ్వారావు పేటలలో మాత్రం గెలిచింది. లేటెస్ట్ గా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టి.ఆర్.ఎస్ లో చేరుతున్నానని ప్రకటించారు.

మరి మెచ్చా నాగేశ్వర రావు చెబుతున్న మాట ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. టిడిపి పార్టీ ఎప్పటికైనా ఎన్.టి.ఆర్ సపోర్ట్ తీసుకోక తప్పదు అయితే ప్రస్తుతం సినిమాల మీద ఫుల్ ఫోకస్ గా ఉన్న ఎన్.టి.ఆర్ పార్టీ సంబందించిన విషయాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఓ పక్క ఎన్.టి.ఆర్ మామ నార్నే శ్రీనివాస రావు ఈమధ్యనే వైసిపిలో చేరాడు. తన మామయ్యను ఆపలేని ఎన్.టి.ఆర్ తెలంగాణాలో టిడిపిని నడిపించగలడా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news