హైదరాబాద్ లో వృద్ధుల కిడ్నాప్ కలకలం..గదిలో బంధించి..!

-

హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో ఇద్దరు వృద్ధుల కిడ్నాప్ కలకలం రేపింది. ఇద్దరు వృద్దురాళ్ళను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్. చేసి అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బంధించారు. ఆ వృద్దులు కేకలు వేయడం భయటకు వినిపించడం తో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ రక్షించి జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఇక తమకు సంబంధించిన కీలక మైన భూమి పత్రాలతో పాటు కొంత బంగారాన్ని దుండగులు లాక్కెళ్లారు అని బాధితులు పోలీసులకు తెలిపారు. మిరాజ్ అనే వ్యక్తి కిడ్నాప్ కు పాల్పడినట్టు పోలీసులకు చెప్పారు. అమీర్ పేట లో తమ పేరు మీద ఉన్న కోట్ల ఆస్తి కోసమే కిడ్నాప్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news