Evaru Meelo Koteeswarulu: బుల్లితెర‌పై దూసుక‌పోతున్న యంగ్ టైగ‌ర్‌.. టీఆర్పీతో బిగ్‌బాస్ కు రికార్డు బ్రేక్‌

-

Evaru Meelo Koteeswarulu : బాక్సాఫీస్ బాద్ షా జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR).. టాలీవుడ్ లో స్టార్ హీరోగానే కాకుండా బెస్ట్ హోస్ట్ గా కూడా దూసుక‌పోతున్నాడు. ఇప్ప‌టికే పలు షోలకు యాంక‌ర్‌గా చేసిన ఆయ‌న ప్రస్తుతం బుల్లితెర బిగ్గెస్ట్ షో అయిన “ఎవరు మీలో కోటీశ్వరులు” షో కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టాప్ టీఆర్పీతో దుమ్ము లేపుతున్నాడు. బుల్లితెర హిస్టరీలో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి సైతం చుక్కులు చూపిస్తున్నాడు.

ఈ హిందీలో ప్ర‌సారమ‌య్యే.. కౌన్ బనేగా కరోడ్‌పతీ ఆధారంగా తెలుగులో రూపొందించిన షోనే మీలో ఎవరు కోటీశ్వరుడు. క్విజ్ ఆధారంగా నడిచే షో ఇది. సామాన్యులను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రారంభ‌మైన ఈ షో తెలుగులోనూ స‌క్సెస్ అయింది. ఈ క్రమంలో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదో సీజ‌న్ ను ప్రారంభించింది. ఈ షో మొదటి మూడు సీజ‌న్ల‌కు కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించగా.. నాలుగో సీజ‌న్‌కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌సారమ‌వుతున్నఐదో సీజ‌న్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ షోను త‌న‌దైన శైలిలో ముందుకు తీసుక‌పోతున్నాడు.

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కర్టన్ రైజర్ ఎపిసోడ్ తోనే హిస్ట‌రీని క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. ముపున్న ఉన్న రికార్ల‌ను బ్రేక్ చేశారు. ఏకంగా టీఆర్పీ 11.4 రేటింగ్ వచ్చింది. ఈ షోతో జెమిని టీవీ రేటింగ్ 290 నుంచి 400 వెళ్లింది. గ‌తంలో కింగ్ నాగ్ హోస్ట్ గా చేసిన మొదటి సీజన్‌కు 9.70, రెండో సీజన్‌కు 8.20, మూడో సీజన్‌కు 6.72 రేటింగ్ వ‌చ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసిన నాలుగో సీజన్‌లో 3.62 రేటింగ్ మాత్రమే దక్కింది. దీంతో స‌రికొత్త రికార్డు జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరిట నమోదైంది.

అలాగే.. తాజాగా ఈ షోకు సంబంధించిన‌ నాల్గవ వారం టీఆర్పీ చూస్తే.. బిగ్ బాస్ షోను దాటేసింది. మొదటి వారం టీఆర్పీ కేవ‌లం 5.62 రావ‌డంతో షో నిర్వాహకులకు షాక్ అయ్యారు. కానీ ఎన్టీఆర్ ఐమేజింగ్ హోస్టింగ్‌తో వ్యూహార్‌ని ఆక‌ట్టుకుంటున్నారు. క్ర‌మంగా ప్రేక్ష‌క ఆధార‌ణ పెరిగింది.
దీంతో, రెండవ వారం టీఆర్పీ 6.48కి చేరింది. ఇక మూడవ వారం షో టీఆర్పీ 7.30కి చేరింది. తాజాగా వీక్ టీఆర్పీ 7.30కి చేరింది. క్ర‌మంగా ప్రతివారం పెరుగుతున్న టిఆర్పి రేటింగ్ చూసి “ఎవరు మీలో కోటీశ్వరులు” షో నిర్వ‌హ‌కులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షో తో బిగ్ బాస్ షోను పోల్చితే.. రెండో వారంలో సగటున 6.18 రేటింగ్ మాత్రమే పొందింది బిగ్ బాస్ షో. ఈ రెండు షోల రేటింగ్ ల‌ను ప‌రిశీలిస్తే.. బిగ్ బాస్ షోను ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ దాటిపోయిందన్న మాట. ఈ దూకుడును ఇలా మెంటెన్ చేయ‌డం కోసం ఎవరు మీలో కోటీశ్వరులు నిర్వ‌హ‌కులు ఓ ప్రత్యేక ఎపిసోడ్స్‌ల‌ను రూపొందించారు.

ఈ షోలో త్వరలో మహేష్‌బాబు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారనే వార్త వినిపిస్తోంది. దసర పండుగ సందర్భంగా వచ్చే ప్రత్యేక ఎపిసోడ్‌లో మహేష్ అతిథిగా రాబోతున్నరంట‌. త్వరలోనే ఈ ఎపిసోడ్‌ షూట్‌ జరగనుందని సమాచారం. ఈ షో టెలికాస్ట్ అయితే.. టీఆర్‌పీ రేటింగ్స్ ఎక్కడికో వెళ్లిపోతాయి అంటూ వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news