ఒకవైపు బ్యాన్ అంటున్నా.. డిమాండ్ పెంచేస్తోన్న రష్మిక..ఎన్ని కోట్లంటే..?

-

ఒకవైపు కర్ణాటక ఇండస్ట్రీ ఈమె తీరుపై మండిపడుతుంటే మరొకవైపు ఈమె మాత్రం తనకు అవకాశాలు ఇచ్చే నిర్మాతలను పారితోషకం విషయంలో డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఈమె నటించినా గుడ్ బై సినిమా విడుదల అయ్యి పర్వాలేదు అనిపించుకుంది. దీంతో పాటు హిందీలో మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు మిషన్ మజ్ను డైరెక్ట్ గా నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

ఇకపోతే ఈ చిత్రం జనవరి 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. శాంతను బాగ్చీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోని స్క్రూవాలా, అమర్ బుటాలా, గరిమో మెహతా తో కలసి నిర్మించారు. అయితే ఇప్పుడు మరొకవైపు తెలుగులో ఈ ముద్దుగుమ్మ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో చాలామంది ఐటెం సాంగ్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గతంలో తమన్న, కాజల్, పూజ హెగ్డే , సమంత లాంటి హీరోయిన్స్ చేశారు. ఇప్పుడు తాజాగా ఐటెం సాంగ్స్ లో నటించడానికి రష్మిక కూడా వచ్చేసింది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో రష్మిక ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిందని సమాచారం. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో నటించడానికి ఈమె దాదాపుగా రూ.5 కోట్ల వరకు డిమాండ్ చేసిందట. అయితే ఈ మొత్తాన్ని నిర్మాతలు ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. మరి నిర్మాతలు ఈమె డిమాండ్ ను అంగీకరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మరి పాటకు తగ్గట్టుగా ఎలివేషన్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ తో ఏ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news