“ఏదో ఒక రోజు నువ్వు గర్వపడేలా చేస్తా తాతయ్య..” సితార మహేష్ బాబు

-

Entertainment సినీ ప్రపంచాన్ని దుఃఖ సాగరంలో ముంచేసి వెళ్లిపోయారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన మరణాన్ని ఘట్టమనేని కుటుంబంతోపాటు.. తెలుగు అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మనవలు గౌతమ్, సితార సోషల్ మీడియా వేదికగా తాత గారిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ ను ఉంచారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు గౌతమ్ కృష్ణ, సితరలకు నానమ్మ, తాతయ్య తో ఎంత అనుబంధం ఉంది. నమ్రత తల్లిదండ్రులు గౌతమ్ చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మమ్మ, తాతయ్య అనుబంధం తెలియని ఈ పిల్లలు.. కృష్ణ, ఇందిరాదేవిలతో ఎక్కువ అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. రెండు నెలల క్రితం ఇందిరా దేవి మరణం సమయంలో సితార వెక్కి వెక్కి ఏడవటం చూసిన వాళ్ళందరినీ కలిసి వేసింది.. అయితే ఆ బాధ నుంచి బయటపడక ముందే కృష్ణ మరణం ఆ కుటుంబానికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా పసి వయసులో నానమ్మ, తాతయ్యల్ని అతి తక్కువ సమయంలో పోగొట్టుకొన్న పిల్లలు అల్లల్లాడిదపోతున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సోషల్ మీడియాలో తాతయ్య కృష్ణ పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంచిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది..

“నువ్వు ఎక్కడ ఉన్నా, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. అలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తుంటావని నాకు తెలుసు. నేను చెప్పలేనంతగా మిమ్మల్ని మిస్ అవుతున్న, మిస్ యూ తాత గారూ.. “అంటూ కృష్ణతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు గౌతమ్..

“వీకెండ్స్ లో లంచ్ మళ్ళీ ఎప్పటిలా ఉండదు. నువ్వు నాకు చాలా విలువైన విషయాలు నేర్పావు. ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నావు. ఇప్పుడు మిగిలింది నీ జ్ఞాపకం మాత్రమే. నువ్వే నా హీరో. ఏదో ఒక రోజు నిన్ను గర్వపడేలా చేయగలనని ఆశిస్తున్నాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తాత గారూ.. ” అంటూ సితార ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news