గుంటూరులో మరో అమృత… ప్రణయ్ ని చంపినట్టే ?

-

తెలంగాణాలోని మిర్యాలగూడలోని అమృత – ప్రణయ్ ల లవ్ స్టోరీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, అమృత – ప్రణయ్ లు వేర్వేరు కులాలకి చెందిన వారు కావడంతో అమృత తండ్రి అల్లుడిని కిరాయి హంతకుల చేత చంపించాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా అలాంటి కేసు ఒకటి గుంటూరులో వెలుగులోకి వచ్చింది. నగరంలో ఓ వివాహిత కిడ్నాప్ అయింది. విజయవాడ కు చెందిన వైశ్య యువతిని గుంటూరుకు చెందిన ఎస్సీ యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. జూలై నెలలో ఈ కులాంతర వివాహం దిలీప్ – సౌమ్యలు చేసుకున్నారు. అయితే పెళ్ళి చేసుకున్న నాటి నుంచి యువతి -యువకుడికి తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నట్టు చెబుతున్నారు.

నల్గొండ ప్రణయ్ విషయం గుర్తు ఉందిగా అంటూ యువతి కుటుంబీకులు హెచ్చరికలు జారీ చేసినట్టు చెబుతున్నారు. ప్రణయ్ మాదిరిగా హత్య చేస్తామని యువతి తల్లిదండ్రులు బెదిరించినట్టు తెలుస్తోంది. అరండల్ పేట సిఐతో సదరు యువకుడుకి తీవ్ర స్థాయిలో బెదిరించినట్టు చెబుతున్నారు. ఆ యువకుడి ఇంట్లో ఉన్న యువతిని పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లినట్టు చెబుతున్నారు. అడ్డువచ్చిన యువతి అత్తని కొట్టి యువతిని పోలీసులు లాక్కెళ్లినట్టు సదరు యువకుడు చెబుతున్నాడు. తనకు ప్రాణహానీ ఉందని ఎస్పీని ఆ యువకుడు ఆశ్రయించాడు.

Read more RELATED
Recommended to you

Latest news