ఫ్లైఓవర్ మీద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి..!

-

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎర్రగడ్డ భరత్ నగర్ ఫ్లైఓవర్ మీద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక వివరాలు చూస్తే.. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎర్రగడ్డ భరత్ నగర్ ఫ్లైఓవర్ మీద ప్రమాదం జరగడం తో మహిళ చనిపోయింది. కూకట్పల్లి నుంచి ఎర్రగడ్డకు వెళ్తున్న టైం లో వాటర్ ట్యాంక్ ఢీకొనడం వలన పక్కనే వెళ్తున్న ఆర్టీసీ బస్సు కిందపడి ఆమె చనిపోయింది.

ఆమె పేరు సునీత అని తెలుస్తోంది. సునీత వయస్సు 26. ప్రైవేట్ జాబ్ చేస్తోంది ఈమె. Kphb లో నివాసం ఉంటున్నట్టు సమాచారం. ఈమె అసలు ఊరు కర్నూలు జిల్లా శ్రీశైలం. కానీ జాబ్ చేసుకుంటూ ఈమె Kphb లో నివాసం ఉంటోంది. కూకట్పల్లి నుంచి ఎర్రగడ్డకు వెళ్తున్న సమయంలో వెనకాల నుంచి వాటర్ ట్యాంక్ ఢీ కొనడం వల్లే సునీత చనిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news