ఎన్డీఏకు వచ్చిన మద్దతుతో ప్రతిపక్షాలు మరింత నిరాశకు గురవతాయి : మోడీ

-

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రెండో దశ పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన విడుదల చేశారు.రెండోదశ పోలింగ్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ‘చాలా సానుకూలంగా ఉందని’ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల నుంచి అధికార కూటమికి అసమానమైన మద్దతు లభించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.పోలింగ్ ముగిసిన అనంతరం ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన.. ‘ఫేజ్2 చాలా బాగుంది.ఓటు వేసిన దేశంలోని ప్రజలందరికీ కృతజ్ఞతలు. ఎన్డీఏకు వచ్చిన అద్భుతమైన మద్దతుతో ప్రతిపక్షాలు మరింత నిరాశకు గురవతాయి అని అన్నారు. ఓటర్లు ఎన్డీఏ సుపరిపాలనను కోరుకుంటున్నారు అని తెలిపారు. యువత, మహిళా ఓటర్లు ఎన్డీఏకు పెద్ద ఎత్తున బలపరిచారని’ తెలిపారు.

కాగా, ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ తర్వాత కూడా ప్రధాని మోడీ ఇదే తరహా ప్రకటన చేశారు. అధికార ఎన్డీఏ కూటమికి ఓటర్ల నుంచి గొప్ప స్పందన కనిపించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డు స్థాయిలో ఎన్డీఏకు ఓటు వేస్తున్నారని వెల్లడించారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news