షాద నగర్ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలను కాపాడిన బాలుడు

-

షాద్నగర్ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం 50 మంది ప్రాణాలను నిలబెట్టింది. స్థానికంగా నివసించే సాయిచరణ్ అనే బాలుడు మంటలను గమనించి భవనం పైకెక్కి తాడు కట్టాడు. ఆ తాడు సహాయంతో బిల్డింగ్ లోని కార్మికులు కిందకు దిగారు. లేదంటే వారందరూ అక్కడే సజీవదహనమయ్యే వారు.కాగా వెల్డింగ్ పనుల వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, నందిగామ మండలంలోని అల్లెన్ ఫార్మసీ కంపెనీలో 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెడరేగడంతో చాలామంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news