మహిళల సింగిల్స్ లో సింధుకు చుక్కెదురు

-

సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చైనాలోని సుజౌలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, భారత షట్లర్లు నేడు విజయం సాధించలేక పోయారు. స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్ లోనే ఓటమి పాలు కావడం జరిగింది. మలేషియా కు చెందిన గోహ్ జిన్ వీ తో జరిగిన గ్రూప్-సి పోరులో సింధు హోరాహోరీ పోరాడినా ఎటువంటి` లాభం లేకుండా పోయింది.

మూడు గేముల పాటు సాగిన ఈ మ్యాచ్ లో సింధు 21-14, 10-21, 20-22తో గోహ్ జిన్ వీ చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్ ను సునాయాసంగా గెలిచిన సింధు… రెండో గేమ్ లో అంత బాగా ప్రదర్శించలేక పోయింది. గోహ్ జిన్ వీ ఆ గేమ్ ను 21-10తో కైవసం చేసుకుంది. మూడో గేమ్ ఆరంభంలో గోహ్ దూకుడు కనబర్చడంతో ఓ దశలో 1-13తో వెనుకబడింది సింధు.
అయితే విశేష రీతిలో పుంజుకున్న సింధు స్కోరు సమం చేయడమే కాదు మ్యాచ్ ను చేజిక్కించుకుంటుందన్న ఆశలు కలిగించింది. స్కోరు 20-20తో సమం అయిన స్థితిలో మలేషియా`షట్లర్ గోహ్ తిరుగులేని ఆటతీరుతో రెండు పాయింట్లు సాధించి విజయం సొంతం చేసుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version