Pakistan : పాకిస్తాన్‌లో మ‌రో సారి ఉగ్ర‌దాడి…..

-

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో ఎన్నిలు జ‌రుగుతున్న వేళ మ‌రో ఉగ్ర‌దాడి చోటు చేసుకుంది.పోలీసులు ప్ర‌యాణిస్తున్న మొబైల్ వ్యాన్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.ఉగ్ర‌వాదులు డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో బాంబు దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.దాదాపు 30 నిమిషాల పాటు కాల్పులు జరిపారు.

ఈ ఘటన పోలింగ్ స్టేషన్ కు సమీపంలో జరిగింది. పోలీసులు మ‌హిళల కోసం కేటాయించిన‌ పోలింగ్ స్టేష‌న్‌లోకి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ప్ర‌వేశించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ దాడుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలి పివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాకిస్తాన్లో 241 మిలియన్ల జనాభా ఉండగా, అందులో 128 మిలియన్ల జనాభా మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news