రేపు ఇండియాతో తలపడే పాకిస్తాన్ జట్టిదే

-

శ్రీలంక లో రేపు ఆసియా కప్ లో భాగంగా ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన జరగనున్న మ్యాచ్ కోసం ప్రపంచంలోని ఇండియా మరియు పాకిస్తాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ జరిగితే అది ఒక సంచలనమే అని చెప్పాలి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రెండు జట్ల మధ్యన జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు కసరత్తులు ప్రారంభించాయి. కాగా కాసేపటి క్రితమే పాకిస్తాన్ జట్టు యాజమాన్యం తమ తుది జట్టును ప్రకటించి ఇండియాకు షాక్ ఇచ్చింది. ఇండియా తో తలపడనున్న పాకిస్తాన్ జట్టును చూస్తే, బాబర్ ఆజామ్ కెప్టెన్ గా ఉండగా ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.

వికెట్ కీపర్ గా రిజ్వాన్ ఎంపికవ్వగా, మిగిలిన స్థానాలలో జమాన్, ఇమామ్ ఉల్ హాక్ , సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, నవ్వాజ్, నషీమ్ షా, ఆఫ్రిది మరియు హరీష్ రాఫ్ లు ఉన్నారు. కట్టుదిట్టంగా ఉన్న పాకిస్తాన్ బౌలింగ్ లైన్ అప్ ను ఇండియా ఎలా డీల్ చేస్తుందో చూడాలి .

Read more RELATED
Recommended to you

Latest news