Breaking: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు

-

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై కాల్పులు జరిగాయి. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లోని జాఫర్‌ అలీ ఖాన్‌ చౌక్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో ఇమ్రాన్‌ ఖాన్‌ కాలికి గాయమైనట్లు సమాచారం. ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు ఆయన కార్యదర్శి రషీద్‌, సింధు మాజీ గవర్నర్‌ ఇమ్రాన్‌ ఇస్మాయిల్‌, పీటీఐ నేత ఫైసల్‌ జావేద్‌కు గాయాలయ్యాయి. దుండగుడు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకు ఇమ్రాన్ ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news