రజినీకాంత్ ఇంటికి తమిళనాడు మాజీ సీఎం !

-

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ చిత్రం జైలర్ సినిమా థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితం అవుతోంది. బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి రజినీకాంత్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాడు. ఈ ఆనంద క్షణాలను రజినికాంత్ తో పంచుకోవడానికి అన్నా డీఎంకే నేత మరియు తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం డైరెక్ట్ గా చెన్నై లోని తన ఇంటికే వెళ్లారు. ఈ సమావేశంలో వీరిద్దరూ దాదాపుగా ఒక గంట సమయం రాష్ట్ర మరియు దేశ రాజకీయాల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తను తెలుసుకున్న కొన్ని చానెళ్లు రజినీకాంత్ ను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి వెళ్లారంటూ అనుకుంటున్నారు. ఇక ఈ విషయంలో స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే రజినీకాంత్ రాజకీయాలు లోకి రావాలనుకుని మళ్ళీ ఎందుకో వెనక్కు తగ్గారు.

ఇప్పుడు వస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు.. మరి ఏమైనా అద్భుతం జరిగిన మళ్ళీ రజినీకాంత్ రాజకీయాల్లోని ప్రవేశించి వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా మారుతారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news