రిపైర్ చేస్తుంటే మంచి కథ దొరికింది ఈ టాప్ డైరెక్టర్ కి .. వెంటనే మహేశ్ కి ఫోన్ చేశాడు ? 

-

‘గీతా గోవిందం’ లాంటి చిన్న బడ్జెట్ సినిమా తో హై రేంజ్ లో లాభాలు వచ్చేలా అదిరిపోయే హిట్ అందుకున్నాడు డైరెక్టర్ పరుశురాం. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కి మరియు హీరోయిన్ రష్మిక కి కూడా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని అనుకోవటం జరిగింది. అదే సమయంలో స్టోరీ కూడా వినిపించాడు. కానీ ఏమాత్రం సెట్ కాలేదు. కాగా ఇటువంటి టైం లో నాగచైతన్యతో సినిమా ఓకే చేసుకుందాం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న పరశురాం కి మహేష్ నుండి ఫోన్ కాల్ రావడం జరిగింది. మీ దగ్గర ఏదైనా స్టోరీ ఉంటే చెప్పాలని ఆఫర్ ఇచ్చారట సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా ఓకే చేసే టైమ్ లో సినిమాకి సంబంధించి సెకండ్ హాఫ్ సరిగా లేకపోవడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మహేష్ నుండి అవకాశం రావడంతో పరుశురాం ఇప్పటికిప్పుడు స్టోరీ రాయాలనుకుంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది.

 

దీంతో… గతంలో తాను చేయాలనుకున్న సినిమా స్టోరీ లు అన్నిటినీ బయటకు తీసి రిపైర్ చేస్తుంటే మంచి కథ దొరికిందట ఈ టాప్ డైరెక్టర్ కి. వెంటనే మహేష్ కి ఫోన్ చేయడం జరిగిందట. దీంతో తొందర్లోనే ఆ స్టోరీ మహేష్ వినబోతున్ననాడు. కాగా ఆ స్టోరీ విన్నాక మహేష్ ఓకే చెబుతాడో లేదో అన్న టెన్షన్ లో పరశురామ్ ఉన్నాడు. అయితే ఇది ఒకప్పుడు పవన్ కల్యాణ్ కోసం రాసుకున్న కథ దొరికింది అని ఇండస్ట్రీలో టాక్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version