నేను శపిస్తే సర్వనాశనం అవుతారు: కేఏ పాల్

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ తెలుగు మీడియా మీద మండిపడ్డారు. తాను ప్రజాశాంతి పార్టీ కి దేశం కోసం రాష్ట్రం కోసం వచ్చానని అన్నారు. తనకి మీడియా కవరేజీ రావట్లేదని తాను మీ కులంలో పుట్టకపోవడం అందుకు కారణమా అని ప్రశ్నించారు. అలానే మీడియా ఛానల్స్ ప్రజలకి న్యాయం చేయకపోతే తను శపిస్తాను అందరూ సర్వనాశనం అవుతారని కేఏ పాల్ అన్నారు.

అలానే మూడు సంవత్సరాలుగా కనీస ఓటు బ్యాంకు లేని షర్మిల కి ఈ విధంగా లైవ్ కవరేజ్ ఎలా ఇస్తున్నారని, బ్యానర్ ఎలా పెడతారని అప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఏపీలో ఆమెకి ఎలా కవరేజ్ ఇస్తారని అన్నారు. తాను మీడియా ఛానల్లో ఓనర్లని వెంటాడుతూ ఉంటానని భారీగా డబ్బులు ఎలా సంపాదించారో పిల్ చేసి అందరూ అంతు చూస్తానని కే పాల్ మీడియా ఛానళ్ల మీద మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news