ఎమ్యెల్యే రోజాకు ఘోర అవమానం..ప్లేక్సిలు చింపేసిన పవన్ అభిమానులు

-

తిరుమల : నగరి వైసీపీ పార్టీ ఎమ్యెల్యే రోజా కు బీమ్లా నాయక్ సెగ తగిలింది. నగరి నియోజకవర్గం లో రోజా ప్లేక్సిలను పవన్ కళ్యాణ్ అభిమానులు చింపేసి.. ఆమెను ఘోరంగా అవమానించారు. అయితే ఈ సంఘటన పై నగరి వైసీపీ పార్టీ ఎమ్యెల్యే రోజా చాలా సీరియస్ అయ్యారు.

బీమ్లా నాయక్ సినిమాను జగన్ మోహన్ రెడ్డి అడ్డుకున్నారు అనడం కరేక్ట్ కాదని ఎమ్యెల్యే రోజా ఫైర్ అయ్యారు. ఏపి లో పవన్ కళ్యాణ్ అభిమానులకు సిఎం జగన్ మోహన్ రెడ్డి మంచే చేసారని చెప్పారు. తెలంగాణలో 350 టిక్కేట్టు వుంటే…. ఏపిలో 150 కే పవన్ కళ్యాణ్ అభిమానులుకు టిక్కేట్టు లభించిందని ఎద్దేవా చేశారు రోజా.

గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం కారణంగానే సినిమా టిక్కేట్ల ధరల పెంపు అంశం పై తమ ప్రభుత్వం తుది నిర్ణయం వాయిదా వేసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వాయిదా వేసుకోవలసిందని చురకలు అంటించారు. చెత్త రాజకీయాలను పక్కకు పెట్టాలని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news