ప‌వ‌న్ క‌ళ్యాణ్.. చంద్రబాబు బినామీ : మాజీ మంత్రి సంచ‌ల‌నం

-

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి శంక‌ర్ నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. చంద్ర‌బాబు బినామీ అంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి ప‌వ‌న్ కు క‌నిపించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కౌలు రైతుల గురించి ఏం తెలుసు అని విమ‌ర్శించారు. చ‌నిపోయిన రైతు కుంటుంబాల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రూ. 7 ల‌క్షల చొప్పున సాయం చేశార‌ని గుర్తు చేశారు. ఇది తెలుసుకోకుండా.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్.. రైతు యాత్ర అనే పేరుతో రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని విమ‌ర్శించారు. చంద్ర బాబు హాయంలో వంద‌లాది మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని అన్నారు. అప్పుడు చంద్ర బాబు సాయం చేశారా.. అని ప్ర‌శ్నించారు. పవ‌న్ క‌ళ్యాణ్ ఓ పార్ట్ టైం రాజ‌కీయ నాయ‌కుడ‌ని విమ‌ర్శించారు. సినిమాలు చేస్తున్న‌ప్పుడు.. ఖాళీ స‌మ‌యాల్లో రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news