నేడు ఏపీకి జనసేనాని..వారితో కీలక సమావేశం..!

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. సోషల్ మీడియాలో కూడా పవన్ వరుస ట్వీట్ లు చేస్తూ ఏపీ ప్రభుత్వం పై మండి పడుతున్నారు. ఇక అమ‌రావ‌తిలో నేడు జ‌న‌సేన విస్తృత‌స్థాయి స‌మావేశం జరగనుంది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజ‌రుకానున్నారు. ప్ర‌భుత్వ విధానాలు, రోడ్ల మ‌ర‌మ్మ‌త్తులు, శ్ర‌మ‌దానంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అక్టోబ‌ర్ 2న తూర్పు గోదావ‌రి, అనంత జిల్లాల్లో ప‌వ‌న్ పర్యటించనున్నారు.

బ‌ద్వేలు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశం పై కూడా పవన్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఏపిలో పవన్ టూర్ ఆసక్తి రేపుతోంది. కొన్ని రోజులుగా పవన్ వెడ్స్ వైసిపి మత్రులు గా వ్యవహారం మారడం తో ఏపీ రాజకీయాల్లో హీటు మరింత పెరిగింది. అంతే కాకుండా వైసీపీ ప్రభుత్వమే టార్గెట్ గా ఇదివరకు ఎప్పుడూ లేనంతగా విరుచుకుపడుతున్నారు. దాంతో పవన్ దూకుడు పెంచారని జనసేన నేతలు, అభిమానులు కుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news