ఏపీలో నన్ను నేను ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకుంటున్నాను..పవన్

-


నన్ను కొనే దమ్ము ధైర్య దేశంలో ఏ పార్టీకి లేదని అలానే ఏ లీడరూ నన్ను ప్రభావితం చేయలేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం చైన్నై లో పలువురు నేతలను కలవడానికి వెళ్లిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… 2019 లో తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా’’ అని ఆశాభావం వ్యక్తం చేశారం. తెలంగాణలో ఏపీ ప్రజలను ద్వితియ శ్రేణి ప్రజలుగా చూస్తున్నారన్నారు. చైన్నైలో నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని వివరించారు. చంద్రబాబు అవినీతి కూపంలో కూరుకుపోయిందని ఆరోపించారు. దీంతో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది.

హోదా ఇస్తామని భాజపా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. అందుకే రాజకీయంలో మార్పు రావాలి. ఇందులో భాగంగానే ప్రముఖులను మేధావులను కలిశా. నేను ఇప్పుడు తమిళనాడుకు రావడానికి కూడా కారణం ఉంది. తమిళనాడుకు జనసేనను పరిచయం చేద్దామని వచ్చా. ‘నా పేరు పవన్‌కల్యాణ్‌.. ఇది జనసేన’ ఇక్కడ నేను పలువురు తమిళ రాజకీయ నేతలను కలుస్తా. దేశంలో ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరిగిందన్నారు. ఎవరు దేశాన్ని పాలించాలో ఆ రాష్ట్రాల వారే నిర్ణయిస్తున్నారు. దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించా తెలిపారు.

బాబుకు టైం దగ్గర పడింది…
మా పార్టీ స్టాండ్‌ ఎటువైపు తీసుకుంటోందో త్వరలోనే చెబుతా. నేను కూడా అందరినీ కలుస్తానేమో. చంద్రబాబు రిటైర్‌మెంట్‌ తీసుకునే సమయం దగ్గర పడింది. రాజకీయాలు వారసత్వంగా రాకూడదు. లోకేశ్ పంచాయతీలో గెలవలేని నాయకుడు ఏపీకి మంత్రిగా పనిచేయడం చాలా బాధాకరం అన్నారు.

ఆ మూడు పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగుపడుతున్నాయి!
‘‘ప్రత్యేక హోదా ఇస్తామని భాజపా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. అందుకే రాజకీయంలో మార్పు రావాలి. దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ప్రముఖులను మేధావులను కలిశా. నేను ఇప్పుడు తమిళనాడుకు రావడానికి కూడా కారణం ఉంది. తమిళనాడుకు జనసేనను పరిచయం చేద్దామని వచ్చా. ‘నా పేరు పవన్‌కల్యాణ్‌.. ఇది జనసేన’ ఇక్కడ నేను పలువురు తమిళ రాజకీయ నేతలను కలుస్తా. భాజపా, కాంగ్రెస్‌, తెదేపా వంటి పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాయి. అందుకే నిజమైన పార్టీల అవసరం ఇప్పుడు ఏర్పడింది. జల్లికట్టు కోసం మీరు పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం. యువత ముందుకు వస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలరో జల్లికట్టు నిరూపించింది.’’

దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలి
‘‘ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లు భారతీయ రాజకీయ వ్యవస్థను శాసిస్తున్నాయి. ఎవరు దేశాన్ని పాలించాలో ఆ రాష్ట్రాల వారే నిర్ణయిస్తున్నారు. దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలి. రాజకీయాల్లో జవాబుదారీ తనం పెరగాలి. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అవినీతి పేరుకుపోయింది. అది వైట్‌కాలర్‌ అవినీతి. ప్రతి నియోజకవర్గంలో రూ.వెయ్యికోట్లపైనే అవినీతి జరిగింది. విభజన రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ గారూ మీకు నేను విన్నవించేది ఒక్కటే. దయ చేసి మీరు ఇచ్చిన మాటకు కట్టుబడండి. జవాబుదారీతనంతో ఉండండి.’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news