అధికారంలో ఉన్న పార్టీ గర్జించడమేంటి : పవన్ కల్యాణ్

-

వైసీపీ కోరుకుంటున్న హింసను జరగనివ్వమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తన విమర్శలు ఎప్పుడైనా విధానపరంగానే ఉంటాయని స్పష్టం చేశారు. రాజధాని గురించి ఎవరూ ఏం మాట్లాడొద్దనేది వైసీపీ ఉద్దేశమని.. కానీ తప్పు జరుగుతోంటే చూస్తూ ఊరుకునే మనస్తత్వం తనది కాదని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ గర్జించడమేంటని.. ప్రజలపై దౌర్జన్యంగా ప్రవర్తించడమేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

విశాఖ గర్జన ప్రకటించిన తర్వాతే జనసేన జనవాణి ప్రకటించిదనటం సరికాదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. వైసీపీ కార్యక్రమానికి ఇబ్బంది కలిగించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

‘‘నా విమర్శలు ఎప్పుడైనా విధానపరంగానే ఉంటాయి. రాజధాని గురించి ఎవరూ ఏమీ మాట్లాడకూడదనేది వైసీపీ ఉద్దేశం. కుల గొడవలతో ఏపీ నిస్సారమైపోతోంది. రాష్ట్రంలో అంతర్గత గొడవలతో నష్టపోతున్నాం. అధికారంలో ఉన్న పార్టీ గర్జించడమేంటీ? వైసీపీ కోరుకుంటున్న హింసను మేం ఇవ్వలేం’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version