“అలయ్ బలాయ్” కార్యక్రమంలో విష్ణును పట్టించుకోని పవన్..!

-

బిజెపి సీనియర్ నేత, గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరం దసరా పండుగ తర్వాత అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆయన గవర్నర్ గా బిజీగా ఉండటంతో దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఈ కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేశారు. ఈరోజు జలవిహార్ లో అంగ రంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతోపాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.

అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మంచు విష్ణు స్టేజిపై పక్క పక్కనే ఉన్నారు. అయితే స్టేజ్ పై మంచు విష్ణు ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ విచ్చేయగా పవన్ కళ్యాణ్ విష్ణును పట్టించుకోకుండానే పక్కకు వెళ్లారు. విష్ణు పలకరించేందుకు ప్రయత్నించినా పవన్ పట్టించుకోనట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version