మేనల్లుడు సాయితేజ్ తో పవన్​ కల్యాణ్ మల్టీస్టారర్.. !

-

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవర్స్టార్ పవన్కళ్యాణ్ మరోసారి మల్టీస్టారర్… మూవీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ తో గోపాల గోపాల, రా నాతో భీమ్లా నాయక్ చేశారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు తన ఫ్యామిలీ లో హీరో, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో మరో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

తమిళంలో గత సంవత్సరం ఓటీటీ లో విడుదలైన సినిమా వినోదయ సితం. సముద్రఖని దర్శకత్వం వహించడం సహా కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు తెలుగులోనూ ఆయన డైరెక్షన్ చేయనున్నట్లు సమాచారం. ఆ డైరెక్షన్ లోనే వీరిద్దరూ నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ లో పవర్ స్టార్ బిజీగా ఉన్నారు. మరవదు సాయి ధరంతేజ్ ప్రస్తుతం ఓ మిస్టరీ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ఈ మల్టీ స్టారర్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news