పోలీసు నోటీసులపై స్పందించిన పవన్ కళ్యాణ్

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్‌ తగిలింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. :పవన్ కళ్యాణ్ తో పాటు నేతలకు 41 A నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇవాళ సాయింత్రం 4 గంటలోగా నగరం/ హోటల్ నుండి వెళ్లిపోవాలన్నది నోటీసు సారాంశం అని సమాచారం అందుతోంది. ఈ నోటీసులపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నేర చరిత్రుల చేతిలో అధికారం ఉంటే ఇలానే ఉంటుందన్నారు.

రాష్ట్రంలో బలహీనుల విషయంలో లా అండ్ ఆర్డర్ బలంగా పనిచేస్తుందని.. అడిగే వాళ్ళు లేరని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టేందుకే విశాఖ గర్జన చేపట్టారని దుయ్యబట్టారు. రెండు చోట్ల ఓడిపోయిన తనకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. రెండు చోట్ల ఓడిపోయినంత మాత్రాన తాను అభివృద్ధి గురించి ప్రశ్నించద్దా? అని అడిగారు. ప్రతి విషయాన్ని కులం, ప్రాంతంతో ముడి పెట్టొద్దని సూచించారు.తెలంగాణ కోసం పుట్టిన టిఆర్ఎస్ కూడా ఇప్పుడు బిఆర్ఎస్ అవుతోందని ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news