కరోనా విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది: పవన్ కళ్యాణ్..!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా తీవ్రత గురించి ప్రధాని మోదీ హెచ్చరిస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా ఓ ఫ్లూ వంటిదని చెబుతోందని తెలిపారు. కరోనా విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని, ప్రజలే జాగ్రత్తలు పాటించాలని పవన్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ చికిత్సను కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా అనుమతులు ఇచ్చి విస్తరించాలన్నారు.

 

ప్రజాప్రతినిధులే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీలు నిర్వహించడం ద్వారా కరోనా వ్యాప్తికి కారణం అవుతుంటే.. ఇక సామాన్య ప్రజలను ఏమంటామని ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు చేసి దాన్ని అభివృద్ది అని చెబితే సరిపోదన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే వైసీపీ పనిచేస్తోందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version