చిన్న వ్యాపారులకు పేటిఎం గుడ్ న్యూస్…!

-

ప్రముఖ ఆన్ లైన్ బ్యాంకింగ్ దిగ్గజం పేటిఎం కొత్తగా ఒక పరికరాన్ని ప్రవేశ పెట్టింది. చిన్న వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా ఉండే విధంగా ఆండ్రాయిడ్ పీఓఎస్ ప‌రిక‌రాన్ని ఈ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప‌రిక‌రం పేటీఎం వాలెట్‌, యూపీఐ ఆధారిత యాప్స్‌, డెబిట్, క్రెడిట్ కార్డ్ , న‌గ‌దుతో స‌హా అన్ని లావాదేవీల‌ను అనుమతిస్తుంది. అదే విధంగా జీఎస్‌టీ బిల్లుల‌ను కూడా జ‌న‌రేట్ చేస్తుంది.

అదే విధంగా పేటీఎం ఫ‌ర్ బిజినెస్ యాప్ ద్వారా చేసే అన్ని లావాదేవీల‌ను నిర్వ‌హిస్తుంది. ఇందులో ఉండే యూనివ‌ర్స‌ల్ కోడ్ కాంటాక్ట్‌లో ఉన్న, లేని వారికి చెల్లింపులు చేస్తుంది. ఈ పరికరం బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌తో, టికెటింగ్, క్యాటరింగ్ నుంచి పార్కింగ్ వరకు వివిధ పరిశ్రమ రంగాలకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరంలో ఉండే ప్రింటర్, స్కానర్ బిల్లులను జనరేట్ చేస్తుంది.

ఈ రోజు, మేము ఎస్ఎంఈల‌ కోసం మా ‘ఆల్ ఇన్ వన్‌’ చెల్లింపు గేట్‌వే అందుబాటులోకి తీసుకొచ్చామని సంస్థ అధినేత విజయ్ శేఖర్ వర్మ పేర్కొన్నారు. ఈ సేవలు వ్యాపారంలో డిజిటల్ చెల్లింపుల ప్రాముఖ్యతను మరింత బ‌ల‌ప‌రుస్తాయి, డిజిటల్ ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌కు స‌హ‌క‌రిస్తాయ‌ని ఆయన విశ్వాస౦ వ్యక్తం చేసారు.

ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌న్ నీలేఖ‌నితో క‌లిసి ఈ ప‌రిక‌రాన్ని ఆయన విడుదల చేసారు. దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను అంగీకరించాలని… పేటీఎం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టడం హర్షించే విషయమని అన్నారు. దీని ద్వారా ఉద్యోగుల జీతాలు, కస్టమర్ రీఫండ్ వంటి మరెన్నో ఆటోమేటెడ్ చెల్లింపులు కూడా చేసుకునే సదుపాయం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news