IPL PBKS vs MI : ముంబైకి అగ్ని ప‌రీక్ష.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

-

ఐపీఎల్ 2022లో భాగంగా ఈ రోజు పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ త‌ల‌ప‌డుతుంది. ఈ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో కీల‌క‌మైన టాస్ ను ముంబై ఇండియ‌న్స్ గెలిచింది. దీంతో రోహిత్ శ‌ర్మ.. మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. దీంతో మాయాంక్ అగ‌ర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

అయితే ముంబై ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ్యాచ్ లు ఓడి పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో ఉంది. చెన్నై ఒక్క మ్యాచ్ గెలిచి ప‌రువు ద‌క్కించుకుంది. నేడు ముంబై కూడా గెలిచి ప‌రువు కాపాడుకోవాల‌ని వ్యూహాల‌ను ర‌చిస్తుంది. కాగ తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ తుది జ‌ట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ ( వికెట్ కీప‌ర్ ), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి

పంజాబ్ కింగ్స్ తుది జ‌ట్టు :
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీప‌ర్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, ఒడియన్ స్మిత్, షారుక్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Latest news