2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తాం – మంత్రి పెద్దిరెడ్డి

-

2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ…
రాప్తాడు సిద్ధం సభ అనంతరం వైసిపి ఎన్నికల ఊపు అందుకుంటుంది…అందుకే ప్రతిష్టాత్మంగా తీసుకుని సభ విజయవంతానికి కృషి చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసిపి శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయని…ఈ సభతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు సిద్దం సభలు పూర్తి అవుతాయని వివరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

peddireddy on siddam meeting

త్వరలో పల్నాడులో మరో సభ నిర్వహణ ఉంటుందని…గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు సాధించేందుకు ఈ సభ ఊతం ఇస్తుందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అతి పెద్ద సభగా ఈ సిద్దం సభ నిలుస్తుంది….2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.దెందులూరు సభ చూస్తే కోస్తా ప్రాంతంలో వైసిపి బలం తెలుస్తుంది….ప్రభుత్వ పనితీరే పార్టీ విజయానికి దోహదపడుతుందన్నారు. అమ్మఒడి, నాడు నేడు, ఆరోగ్య శ్రీ లాంటి గొప్ప పథకాలు అమలు చేస్తున్నాం…ఎన్నికల్లో చెప్పుకునేందుకు అనేక పథకాలు సిఎం వైయస్ జగన్ మాకు అందించారని గుర్తు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news