ఢిల్లీలో ఆందోళన చేసే పరిస్థితి వస్తే చేస్తాం..జగన్ వెనుకాడే వ్యక్తి కాదు !

-

విశాఖ స్టీల్ ప్లాంటుపై ఢిల్లీలో ఆందోళన చేసే పరిస్థితి వస్తే చేస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఆందోళన చేయడానికి జగన్ వెనుకాడే వ్యక్తి కాదన్న ఆయన కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేస్తున్నామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కాబినెట్టులో చర్చించామన్న ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

ఏపీ గురించి.. ప్రత్యేక హోదా కోసం సుజనా చౌదరి మాటలను ఎవ్వరైనా నమ్ముతారా..? అని ప్రశ్నించిన ఆయన ఏపీని చంపేసే విషయంలో కత్తిపోటు పొడిచిన సుజనా మాట్లాడితే ఎవ్వరూ నమ్మరని అన్నారు. ఏ రోటికాడ ఆ పాట పాడడం సుజనాకు అలవాటు.. అలా మాట్లాడకుంటే లెక్క పెట్టాల్సి వస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version