పవన్ కల్యాణ్ వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది : పేర్నినాని

-

మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు మోసగాడైతే జనసేనాని గజమోసగాడని విమర్శించారు. 2014 నుండి 2019 వరకు పవన్ కల్యాణ్ వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది? అని పేర్ని నాని నిలదీశారు. పవన్ సినిమా, సీరియల్స్ డైలాగ్‌లు కొడతారన్నారు పేర్ని నాని. ఓ టీషాప్ వ్యక్తి ఇచ్చిన డబ్బులతో జనసేనాని లారీని కొని దానిని మోడిఫై చేసి, వారాహి అని పేరు పెట్టారన్నారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాడో చెప్పాలన్నారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తున్నాడా? లేడా? చెప్పాలన్నారు. కలిసి పోటీ చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉందా? పేర్ని నాని అని నిలదీశారు.

విద్యపై చంద్రబాబుకు దర్శనికత ఎక్కడ ఉందని పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీని ప్రపంచ పటంలో పెడతానని కాలజ్ఞానం చెబుతున్నారని పేర్ని నాని ఎద్దేవా చేసారు. టీడీపీకి అధికారం ఇస్తే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానని చెబుతున్నారని చెప్పుకొచ్చారు. నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్లను చూసి మురిసిపోయారు తప్ప ఒక్క గవర్నమెంట్‌ స్కూల్‌ అయినా కన్నెత్తి చూశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో అక్షరాస్యతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ చిట్ట చివరన నిలిచిందని పేర్ని నాని గుర్తు చేసారు. హెల్త్‌ పట్ల చంద్రబాబుకు ఉన్న విజన్‌ ఏంటని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ చంద్రబాబుది కాదు, ఇది వైయస్‌ఆర్‌ విజన్‌ గా గుర్తు చేసారు. విజన్ 202 అడ్రస్ లేకుండా పోయిందని, ఇవాళ 2047 మొదలుపెట్టారని ఎద్దేవా చేసారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version