ఓలాలో ఇక నుంచి ఫోన్ పే చెల్లింపులు..!

-

ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు అనేవి సర్వ సాధారణంగా మారిపోయాయి. ఎక్కడికి వెళ్ళినా సరే క్యాష్ చెల్లింపుల కంటే కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఎక్కువగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా ప్రముఖ సంస్థ అయిన ఓలా కూడా తన వినియోగదారుల కోసం ఫోన్ పే సౌకర్యాన్ని కల్పించింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన చేసింది.

యాప్‌లో చెల్లింపులను ప్రారంభించడానికి ఫోన్‌పేతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఓలా మంగళవారం ప్రకటించింది. తమ పరిచయ ఆఫర్‌లో భాగంగా, ఓలా యూజర్లు ఫోన్‌పే యాప్ ద్వారా చెల్లింపు చేస్తే మొదటి రెండు రైడ్స్‌లో రూ .200 క్యాష్‌బ్యాక్ పొందవచ్చని సంస్థ పేర్కొంది. వినియోగదారులు వారి ఫోన్ నంబర్ మరియు అన్ని ఇతర వివరాలను నమోదు చేయడం ద్వారా వారి ఫోన్‌పే ఖాతాను ఓలాతో లింక్ చేయవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news