మాన్ కీ బాత్ : ఏపీ యువకుడిపై ప్రధాని మోడీ ప్రశంసలు

-

తిరుపతి : ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన యువకుడిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంశలు కురిపించారు. తిరుపతికి చెందిన యువకుడు సాయి ప్రణీత్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సాయి ప్రణీత్ సేవలను కొనియాడరు ప్రధాని మోదీ.

ఏపీ వెదర్ మ్యాన్ పేరుతో వాతావరణ సమాచారాన్ని సాయి ప్రణీత్ అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా రైతులకు అందిస్తున్న సాయి ప్రణీత్ సేవలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయి ప్రణీత్ సేవలు గుర్తించిన ప్రధాని మోదీ.. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా సాయి ప్రణీత్ పని చేస్తున్నాడు. ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ, ఐరాస హ్యాబిటేట్ ప్రశంసలు అందుకున్నాడు సాయి ప్రణీత్. సాయి ప్రణీత్ అందిస్తున్న సేవలను తెలుసుకుని మన్ కీ బాత్ కార్యక్రమం లో ప్రస్తావించారు ప్రధాని మోదీ. సాయి ప్రణీత్ దేశానికి ఎంతో అవసరమని ప్రధాని మోడి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news