జన్​ధన్​కు నేటికీ ఆరేళ్లు.. మ‌హిళ‌లే టాప్‌ – మోదీ

-

ప్రధానమంత్రి జనధన్​ యోజన ప్రారంభమై ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పథకంపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మంది పేదలకు లబ్ధి చేకూరిందని ట్వీట్​ చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఇన్ఫోగ్రాఫిక్స్​ను కూడా పోస్టు చేశారు.

బ్యాంకింగ్​ సేవలు అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం పీఎం-జన్​ధన్​యోజనను ప్రారంభించాం. దీని ద్వారా సమూల మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఈ పథకం పునాదిలా మారింది. కోట్లాది మంది ప్రజలకు లబ్ధి చేకూరింది. ఎన్నో కుటుంబాల భవిష్యత్తుకు భరోసా లభించింది. దీని ద్వారా ప్రయోజనం పొందినవారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలు ఉన్నారు. ఈ పథకం విజయం కోసం నిర్విరామంగా శ్రమించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అని ప్రధాని మోదీ అన్నారు.

దేశంలోని ప్రతిఒక్కరికి బ్యాంకింగ్​​ సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో 2014 ఆగస్టు 15న పీఎం-జన్​ధన్​ యోజనను ప్రారంభించారు మోదీ. 2015 ఆగస్టు నాటికి ఈ బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90కోట్లుగా ఉండగా.. 2020 ఆగస్టు నాటికి ఆ సంఖ్య 40.35 కోట్లను దాటింది.ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరు జీరో బ్యాలెన్స్ అకౌంట్​ తెరవచ్చు. ఎలాంటి రుసుములు ఉండవు. ఉచితంగా డెబిట్​ కార్డు పొందవచ్చు. ఖాతాదారులకు రూ.2లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version