19న తెలంగాణకు ప్రధాని మోడీ…పరేడ్ గ్రౌండ్స్ లో సభ

-

తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోకస్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే గతంలో రెండుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రాగా.. మరోసారి ఈ నెలలో తెలంగాణకు రానున్నారు మోడీ. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది.

 

ఈనెల 19న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో చిన్న సభలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే, సికింద్రబాద్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్నారు మోడీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకి శంకుస్థాపన చేయనున్నారు..కాజీపేట రైల్వే కోచ్ ఓవరాలింగ్ వర్క్ షాప్ కు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version