అరుదైన రికార్డుకు పోలవరం శ్రీకారం…

-

పోలవరం నిర్మాణంలో మరో అరుదైన రికార్డు సాధనకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్పిల్‌ ఛానల్‌లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు చేపట్టిన 24 గంటల పనులు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ పనులు సోమవారం ఉదయం 8 వరకు ఈ పనులు కొనసాగనున్నాయి. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో దీన్ని నమోదు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిథి విశ్వనాథ్‌ సమక్షంలోనే పనులకు శ్రీకారం చుట్టారు. దుబాయ్‌లో గతంలో నమోదైన రికార్డును అధిగమించేందుకు 24 గంటల్లో 30వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఏర్పాటు చేశారు.

దుబాయ్‌లోని ఓ టవర్‌ నిర్మాణం సందర్భంగా 2017 మే లో 36 గంటల్లోనే 21,580 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వేశారని, ఇప్పుడా రికార్డును అధిగమించేందుకు 24 గంటల్లోనే 30 వేల ఘ.మీ. కాంక్రీట్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news