నిందితుడిని అరెస్టుతో ఏకంగా 60 మంది పోలీసులు హోమ్ క్వారంటైన్

-

ప్రస్తుత రోజుల్లో మనతో కలిసి మెలిసి తిరిగి తిరుగుతున్న వారిలో ఎవరికి ఎవరికి కరోనా ఉందొ, ఎవరికీ లేదో చెప్పలేని పరిస్థితి. ఇకపోతే తాజాగా ఓ అత్యాచారం కేసు నిందితుడిని అరెస్టు చేయడంతో ఏకంగా 60 మంది పోలీసులు క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బిలాస్‌పూర్‌ లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మహిళపై లైంగిక దాడి చేయడంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు నలుగురు పోలీసులు మైసూరు కు వెళ్లి, అక్కడ అతన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చారు. ఆ తర్వాత ఆయనని రిమాండ్ కు తరలించారు.

police

నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది. సదరు వ్యక్తిని రిమాండ్ కు తరలించే సమయంలో అతనికి జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జైలు అధికారులు తెలుసుగా… మైసూర్ నుంచి తీసుకువచ్చిన పోలీసులకు వారు తెలియజేశారు. దీంతో ఆ నలుగురు తోపాటు వారితో కలిసి పనిచేస్తున్న 60 మంది పోలీసులకు హోమ్ క్వారంటైన్ కు వెళ్లాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీనితోపాటు వారు పనిచేసే పోలీస్ స్టేషన్ కు సీల్ వేశారు కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version