నేడు కోర్టు లో సుమ‌న్ ను హ‌జ‌రు ప‌ర‌చ‌నున్న పోలీసులు

-

రంగ‌రెడ్డి జిల్లా మంచి రేవుల లో ఉన్న‌ హీరో నాగ శౌర్య ఫామ్ హౌస్ పేకాట కేసు దార్య‌ప్తు ను పోలీసులు ముమ్మురంగా సాగిస్తున్నారు. ఈ కేసు లో ప్ర‌ధాన నింధితుడు గుత్తా సుమ‌న్ ను పోలీసులు కోర్టు లో ప్ర‌వేశ ప‌ట్ట నున్నారు. అయితే గుత్తా సుమ‌న్ ను గ‌త రెండు రోజుల నుంచి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. సుమ‌న్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా పోలీసులు ప‌లువురి ని కూడా అదుపు లోకి తీసుకున్నారు.

అయితే ఈ కేసు విష‌యంలో గ‌తంలో కోర్టు సుమన్ ను రెండు రోజుల పాటు క‌స్ట‌డీ లోకి తీసుకుని విచార‌ణ చేయాలని పోలీసుల‌ను ఆదేశించింది. అయితే ఈ రెండు రోజుల పాటు పోలుసులు సుమ‌న్ ను విచారించారు. నేటికి పోలీసుల క‌స్ట‌డీ ముగియ‌డంతో తిరిగి మ‌ళ్లి కోర్టు లో హాజ‌రు ప‌రుస్తున్నారు. అయితే ఈ రెండు రోజుల సుమ‌న్ క‌స్ట‌డీ లో పోలుసులు ప‌లు కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తుంది.

 

ముఖ్యంగా సుమ‌న ఫోన్ లో ఉన్న వాట్సాప్ ఛాటింగ్ పై దృష్టి సారించారు. అలాగే న‌గరంలో ఇలాంటి పేక‌ట కేంద్రాలు ఎక్క‌డా ఎక్క‌డా నిర్వ‌హిస్తున్నారో అని సుమ‌న్ ప్ర‌శ్నించారు. అలాగే ఇత‌ర ఫామ్ హౌస్ ల‌కు సుమ‌న్ కు ఏమైన లింక్ ఉందా అనే కోణంలో విచార‌ణ చెపట్టారు. అలాగే ఇప్ప‌టికే సుమ‌న్ ప‌లువురి గురించి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. వారిని త్వ‌ర‌లోనే పోలీసులు ఆరెస్టు చేస్తార‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news