మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం.. కేటీఆర్ సంచలన కామెంట్స్

-

మూసీ సుందరీకరణ పేరులో కాంగ్రెస్ సర్కార్ రూ.వేల కోట్ల కుంభకోణానికి తెర లేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి ఫతేనగర్‌, కూకట్‌పల్లిలోని మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..ఎస్టీపీల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందన్నారు.కూకట్‌పల్లి ఎస్టీపీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

ktr

కూకట్‌పల్లి నాలాను శుద్ధి చేయాలని అధికారులను కోరారు.హైదరాబాద్‌ను మురుగునీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో తమ ప్రభుత్వ హయాంలో ఎస్టీపీలను ప్రారంభించామని గుర్తుచేశారు.రూ.3,866 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టామన్నారు. మూసీ సుందరీకరణ పేరులో సర్కార్ రూ.వేల కోట్ల స్కాంకు తెర లేపిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version