వ్యాక్సిన్ కంటే బురద బెస్ట్ అంటున్న బిజెపి ఎంపీ…!

-

ఒక పక్క కరోనా వైరస్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కాస్త దుమారం రేపే విధంగా ఉన్నాయి. తాజాగా ఒక బిజెపి ఎంపీ గారు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ పార్టీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనపూరియా మీడియాతో మాట్లాడుతూ… శంఖం ఊదుతూ బురదలో కూర్చుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన ప్రజలకు ఒక సలహా ఇచ్చారు.

లాక్ డౌన్ లో కాళీగా ఉన్నారో ఏమో గాని ఆయన్ ఇచ్చిన సలహా మాత్రం కాస్త సంచలనంగా మారింది. తద్వారా మన శరీరం కొవిడ్-19పై సమర్థంగా పోరాడగలదని ఆయన అన్నారు. ఇంతే కాదు ఒంటికి బురద రాసుకుని యోగా చేస్తే ఏమీ రావు అని, ఆ పనులు చేయాలని ఆయన సూచించారు. ఈ వ్యాక్సిన్ బదులు బురద రాసుకుంటే బెస్ట్ అని తెలిస్తే ప్రయోగాలు టైం వేస్ట్ కదా…?

Read more RELATED
Recommended to you

Latest news