బ్రేకింగ్; ప్రభుత్వానికి పవన్ వార్నింగ్…!

-

రైతులను మహిళలను భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చెయ్యాలని ప్రభుత్వం చూస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అమరావతిని రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇచ్చిన ఆయన, మంగళవారం జాతీయ రహదారి దిగ్బంధనం సందర్భంగా రైతులపై పోలీసుల వైఖరిని పవన్ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో లేఖ విడుదల చేసారు. “రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్దతిలో శాంతి యుతంగా నిరసన తెలిచేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుంది.

ఈ రోజు చినకాకాని దగ్గర రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్ధనీయం కాదు. రైతులను మహిళలను భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చెయ్యాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ రోజు నిరసన మొదలుకాక ముందే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ గారిని గృహ నిర్భందంలో ఉంచారు. పరి కార్యదర్శి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ ను కారణం చెప్పకుండానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలాంటి చర్యలతో ఆందోళనలను ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటే అవుతుంది.

అమరావతి నుంచి రాజధానిని తరలించి భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. విశాఖపట్నం వాసులకు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనుకబాటుతనం ఉంది. అక్కడి నుంచి వలసలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ జిల్లాల అభివృద్దిపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాలికలు లేవు. రాయలసీమ వాసులకి విశాఖపట్నం అంటే దూరాభారం అవుతుంది. సీమ నుంచి విశాఖ వెళ్ళాలి అంటే ప్రయాణం ఎంతో కష్టతరం.

ఈ విషయమై సీమ వాసుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను వైసీపీ ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరిస్తుంది. రాజధాని మార్పు అనేది ఉద్యోగులకు ఎన్నో ఇబ్బందులను సృష్టిస్తుంది. హైదెరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్ళిన ఉద్యోగులు తమ పిల్లలను విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చదివిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కుదురుకున్తున్నారు. వాళ్ళను మళ్ళీ విశాఖకు పంపిస్తే వారి కుటుంబాలకు ఎన్నో వ్యయప్రయాసలు లోనవుతాయి. అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతుంది.

ఎవరికి సంతృప్తి కలిగించడం లేదు. తాము భూములు త్యాగడం చేసిన ప్రాంతంలోనే రాజధాని ఉంచాలని అమరావతి ప్రాంతవాసులు కోరుతున్నారు. రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతంలో చేసిన మహా పాదయాత్ర వారి ఆవేదనకు అడ్డం పట్టింది. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఆందోళనలను అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని ప్రభుత్వం గ్రహించాలి. అని పవన్ లేఖ విడుదల చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news