చేనేత కార్మికులకు జగన్‌ తీపి కబురు.. వారి అకౌంట్లలో రూ. 24 వేలు

-

చేనేత కార్మికులకు జగన్‌ సర్కార్‌ తీపికబురు చెప్పింది. చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించే నేతన్న నేస్తం మూడో విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ నెల 10న ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న కార్మికులకు రూ. 24 వేలు ఇవ్వనుంది సర్కార్‌. చేనేత కార్మికుల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తారు.

పథకాన్ని లబ్ధిదారులకు చేరు చేసేందుకు శనివారం నుంచే మూడు రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించాలని గ్రామ, వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్మికులు స్థానికంగా చేనేత సంఘంలో రిజస్టర్‌ అయి ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది. నేతన్న నేస్తం కింద సొంతం మగ్గం కలిగిన చేనేత కార్మిక కుటుంబాలకు ఏడాదికి రూ. 24 వేలు అందిస్తారు. సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్‌ఆర్‌ చేనేత నేస్తం పథకం అందుతుంది. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్‌ గానే పరిగణిస్తారు. ఈ పథకంతో చేనేత కార్మికులకు ఎంతో ఉపయోగం కలుగునుంది.

Read more RELATED
Recommended to you

Latest news