ఈట‌ల‌తో కొండా సురేఖ‌ దంప‌తులు భేటీ.. కార‌ణం అదేనా?

-

ఈట‌ల రాజేంద‌ర్ రాజ‌కీయాలు ఊహ‌కు కూడా అంద‌కుండా ఉన్నాయి. ఆయ‌న ఎప్పుడు ఎవ‌రిని క‌లుస్తారో, ఎవ‌రితో భేటీ అవుతారో అంతు చిక్క‌డం లేదు. ఒక పార్టీ లేదు, ఒక సంఘం లేదు, ఒక వ‌ర్గం లేదు. వ‌రుస‌గా అంద‌రినీ క‌లుస్తున్నారు. అంద‌రి మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. పోనీ కొత్త పార్టీ పెడుతున్నారా అంటే అదీ లేద‌ని చెబుతున్నారు.

ఇంకేదైనా పార్టీలో చేర‌తాడా అంటే అది కూడా లేద‌ని తేల్చి చెబుతున్నాడు ఈట‌ల‌. మ‌రి ఎందుకు క‌లుస్తున్న‌ట్టు, దేనికోసం ఇదంతా అనేది స్ప‌ష్టంగా తెలియ‌ట్లేదు. ఇక తాజాగా ఆయ‌న‌ను కొండ సురేఖ దంప‌తులు శామీర్ పేట‌లోని ఆయ‌న ఇంటికెల్లి క‌లిశారు.

గ‌తంలో కొండా దంప‌తులు టీర్ ఎస్‌లో ఉన్న‌ప్పుడు ఈట‌ల వారికి ఎన్నో ర‌కాలుగా మ‌ద్ద‌తుగా నిలిచాడు. వారు కాంగ్రెస్‌లో చేరినా ఏనాడు ఈట‌ల‌ను వ్య‌తిరేకించ‌లేదు, విమ‌ర్శించ‌లేదు. వీరి మ‌ధ్య మొద‌టి నుంచి మంచి సన్నిహితం ఉంది. వీరు ఇప్పుడు కాంగ్రెస్‌లో కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. అయితే ఈట‌ల‌ను క‌లిసింది మాత్రం ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకేన‌ని చెబుతున్నారు. మ‌రి ఈ భేటీల‌పై ఈట‌ల స్పష్ట‌మైన జ‌వాబు ఎప్పుడు చెబుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version