టీడీపీకి మరో షాక్… వైసీపీలో చేరనున్న టీడీపీ ఎమ్మెల్యే

-

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార టీడీపీ పార్టీకి బీభత్సంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారట. వైఎస్సాఆర్సీపీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా టీడీపీకి ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయనకు మరోసారి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీ హైకమాండ్ తో మాట్లాడటం లేదు. వైసీపీ నుంచి సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ లేదా నరసరావుపేట ఎంపీ టికెట్ ఇవ్వడానికి వైసీపీ నుంచి హామీ రావడంతో ఆయన వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version