అద్వానీని పీఎంని చేసే ద‌మ్ము ఉందా.. బీజేపీకి జ‌గ్గ‌రెడ్డి స‌వాల్

-

గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల‌తో దేశ ప్ర‌జ‌ల‌కు రక్త సంబంధం ఉంద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గ‌రెడ్డి అన్నారు. దేశంలో కోసం వారు ఎన్నో త్యాగాలు చేశార‌ని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ప్ర‌ధాన మంత్రి సీటునే త్యాగం చేశార‌ని అన్నారు. వారు పీఎం కాకుండా.. మ‌న్మోహ‌న్ సింగ్ కు ఇచ్చార‌ని అన్నారు. ఇప్పుడు ప్ర‌ధాన మంత్రి సీటును అద్వానీకి త్యాగం చేసే ద‌మ్ము బీజేపీకి ఉందా అని ప్ర‌శ్నించారు.

బీజేపీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి త్యాగాల చ‌రిత్ర లేద‌ని విమ‌ర్శించారు. అలాగే విలువ‌లు, నీతి లేని పార్టీ కూడా బీజేపీయే అని మండిప‌డ్డారు. త్యాగాల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శించే.. హ‌క్కు, అర్హ‌త బీజేపీకి లేద‌ని అన్నారు. ఈ మ‌ధ్య కాలంలో బీజేపీ నాయ‌కులు త‌మ పార్టీ నాయ‌క‌త్వంపై అనేక విమ‌ర్శులు చేస్తున్నార‌ని.. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాని అన్నారు. కాగ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళ‌న గురించి త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు. త‌న‌కు ఆందోళ‌న గురించి ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news