నెల్లూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నెల్లూర్ జిల్లాలో ఆటోని లారీ ఢీ కొట్టి ఘోర‌ రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు మృతి చెందారు. కాగ నెల్లూర్ జిల్లాలోని చిల్ల‌కూరు మండ‌లంలో చేడిమాల స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. చేడిమాల పెట్రోల్ బంక్ వ‌ద్ద ఆటోను లారీ బ‌లంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో నుజ్జు నుజ్జు గా అయింది. అంతే కాకుండా ఆటోలో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు ప్ర‌యాణీకులు అక్క‌డి క‌క్క‌డే మృతి చెందారు.

ఈ ప్ర‌మాదంలో మూడు మృత దేహాలు చ‌ల్ల చ‌దురుగా ప‌డిపోయాయి. ర‌క్తం ఏరులై పారింది. కాగ స్థానికులు స‌మాచారం ఇవ్వ‌డంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. రోడ్డు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై విచార‌ణ చేప‌ట్టారు. ఈ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన వారి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగ‌ మృతి చెందిన వారి వివ‌రాలను పోలీసులు సేక‌రిస్తున్నారు. అలాగే పోలీసులు కేసు న‌మోదు చేసుకుని.. ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news