హర్యానా ఎన్నికలు.. ఓటేసిన ఒలింపిక్ విజేత మనుబాకర్, ప్రముఖులు!

-

హర్యానాలో అసెంబ్లీకి పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 90 స్థానాలకు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగియనుంది. అయితే, ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో 2 కాంస్య పతకాలు సాధించిన షూటర్ మనుబాకర్ తొలిసారి ఎన్నికల్లో ఓటేశారు. చర్కి దాద్రీలోని పోలింగ్ బూత్‌‌లో తన తండ్రితో కలిసి ఓటును వినియోగించుకున్నారు. ‘ఈ దేశంలోని యువతగా అనుకూలమైన అభ్యర్థికి ఓటు వేయడం మన బాధ్యత.చిన్న అడుగులు పెద్ద లక్ష్యాలకు దారితీస్తాయి.నేను తొలిసారి ఓటు వేశాను’ అని మను తెలిపారు.

ఇక కర్నాల్‌లో కేంద్రమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తన ఓటును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.చర్కి దాద్రిలోని పోలింగ్‌ బూత్‌లో మాజీ రెజ్లర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి వినేశ్‌ ఫొగట్ ఓటేశారు. ఓటింగులో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ కురుక్షేత్రలో ఓటేశారు.హర్యానా సీఎం, బీజేపీ అభ్యర్థి నాయబ్‌ సింగ్‌ సైనీ అంబాలాలో ఓటేశారు.హర్యానాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఫరీదాబాద్‌లో కేంద్రమంత్రి కృషణ్‌ పాల్‌ గుర్జార్‌, సిర్సాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌటాలా ఓటుహక్కు వినియోగించుకున్నారు.భారత సంపన్న మహిళ,స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్‌ హిస్సార్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news