మూడేళ్ల‌లో మోడీ స‌ర్కార్ ప్ర‌క‌ట‌నల ఖ‌ర్చు రూ. 1,698.98 కోట్లు

-

కేంద్రం లో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం గ‌డిచిన మూడు సంవ‌త్సరాల లో ప్ర‌క‌ట‌న ల కోసం ఖ‌ర్చు చేసిన మొత్తం రూ. 1,698.98 కోట్లు ఉంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పార్ల‌మెంట్ లో నే ప్ర‌క‌టించారు. ఈ రోజు లోక్ స‌భ లో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ అధ్య‌క్షుడు ఎంపీ మౌల‌న బ‌ద్రుద్దీన్ అజ్మ‌ల్ అడిగిన ప్ర‌శ్న కు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖిత పూర్వ‌కం గా స‌మాధానం ఇచ్చాడు.

2018-19 నుంచి 2020-21 మధ్య న్యూస్‌ పేపర్లకు, న్యూస్‌ ఛానల్స్‌కు ప్రకటనల కోసం రూ. 1,698.98 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స‌మాధానం ఇచ్చాడు. అయితే మోడీ సర్కార్ ప్ర‌జ స‌మ‌స్య ల కంటే.. వాళ్ల ప్ర‌చారం కోస‌మే అధికంగా ఖ‌ర్చు చేస్తుంద‌ని ప్ర‌తి ప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. వ్య‌క్తి గ‌త ప్రచారం కోసం న‌రేంద్ర మోడీ వేల కోట్ల ప్ర‌జా ధ‌నాన్ని ఖ‌ర్చు చేస్తున్నార‌ని ప్ర‌తి ప‌క్షాలు మండిపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news