మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

-

గ్రామ-వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. మహిళా ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ఉద్యోగుల తరహాలోనే వారికి కూడా 180 రోజుల ప్రసూతి సెలవులు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో విధులు నిర్వహిస్తోన్న గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ప్రసూతి సెలవులను ఇవ్వలేదు. దీంతో వారు కూడా సెలవుల డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు.

మహిళా ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వారి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో వేల సంఖ్యలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో లబ్ది చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news