సుహాసిని పోటీపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఏంటంటే…!

-

గత కొన్ని రోజులుగా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులపై చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మహాకూటమి తరుపున జూనియర్ ఎన్టీఆర్ సోదరి, నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలోకి దింపాడు చంద్రబాబు. దీంతో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఎవరూ ఊహించని విధంగా సుహాసిని అకస్మాత్తుగా తెరమీదికి రావడంతో ఇప్పుడ సర్వత్రా చర్చనీయాంశమైంది.

సుహాసిని పోటీపై నందమూరి కుటుంబ సభ్యుల్లో కొంచెం అనిశ్చితి నెలకొన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. సమాజంలో మహిళలు ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం తమది అంటూ వాళ్లు తెలిపారు. అందుకే.. అదే స్ఫూర్తితో ముందుకెళ్తూ… ప్రజాసేవ కోసం సిద్ధపడుతున్న తమ సోదరి విజయానికి అందరూ సహకరించాలంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version